Popular Posts

Monday, February 22, 2010

రాఘవహారి కీర్తనలు


రాఘవహారి కీర్తనలు
రచన :-కె.పి.రాఘవేంద్ర
I.D.B081623

2).పల్లవి:-జీవనజ్యోతి మనసు వేదికై
మమతలు పంచే జాతి నేస్తమై
ఒకరికి ఒకరు తోడుగ కలిసిక జీవనగమ్యం దాటాలి
మమతలు పంచుతు ఆదర్శంగా మెలగాలి
భరతరత్నవై నువ్వు భారతికే అందించాలి ........."జీవనజ్యోతి "
చరణం 1:-మదినే మంత్రమై, దేహంతంత్రమై
కాంతినే మించగా ,శాంతినే పరచగ
జాతినే నిలుపగ, భ్రాంతియేకలుగగా
మాతృభూమికిక మరుజన్మమే వెలగదా, మనస్సె పొంగదా ..............."జీవనజ్యోతి "
చరణం 2:-వలపే రాగమై,స్వప్నం స్నేహమై
కలిమితో ప్రాణియై, చెలిమె కలుగగ
ఉల్లాసం ఊపిరై, బ్రతుకె భారమై
జాతిసమైక్యతకి సహజీవం చెయ్యవా, సందేశం ఇవ్వవా ............"జీవనజ్యోతి "



3)పల్లవి:- సృష్టికే ఒక నిలయమైన భారతం.....
సృష్టికే ఒకదైవమైన భారతం ఇక తిరుగులేదోయ్.............." సృష్టికే"
చరణం 1:-మాతృభూమని మరచి అందరు మానవతనే చీల్చిరోయ్
భారతానికి తిరుగువున్నది భావిభారతపౌరులోయ్
భారతంలో ప్రజలు అందరూ భానిసలు కాకుడదురా
కడుపు చిల్చెకాని వానిని ఆగ్ని జ్వాలల తరమరా......" సృష్టికే"
చరణం 2:-హిమము రత్నకీరిటము ఆరవల్లి ఆభయహాస్తం
ఆంధ్రదేశము కాళ్ళకై పూభంతులుగ అయ్యెనా
కన్నతల్లి పుణ్య భువిలో మల్లి జన్మంకాననా
భారతానికి పుణ్యభూమని కీర్తినే ఇక దించెరా....." సృష్టికే"

కవితలు


1. మూగ బోయిన గోంతు ???
-కె.పి.రాఘవేంద్ర

సేవప్రయత్నపు పుట్టల్లోంచి
పరితపించె ఆత్మకు మరణం ఎక్కడిది ?
జీవనమే జ్యోతిగా,ప్రకాశించె
మనస్సును క్షణకాలం పాటు
రవికిరణం లాగా ప్రసరించే
సేవపూరిత హారితాంధ్రదాత!


పేద కడుపులలో రగిలే
కన్నిటి భాదలకు కృషించి
వర్షించె అన్నప్రదాత
అడుగడుగున నవతరాన్ని
కదిలిస్తూ చిరునవ్వులతో
అమృతవీణను వాయించిన
రాయలసీమ రారాజు................వై.ఎస్.రాజశేఖరుడు


మనోభావోద్వేగ సంకటిత పరంపర
పట్టుదల, విడవని శ్రమయే,
ద్యేయపూరిత, దేహానిశ్కల్మషంగా
అతని,వరహాస్తల్లొంచి జారువడిన
పథకపు జీవనద్దాలు .
జనజాగృతి కొరకు సైతం
కర్కశపాశాలను త్రెంచే ఆలోచనలతో
ప్రజలలోనిలిచిన జలయజ్ఞ సాగరుడు............వై.ఎస్.అర్


పేదల భాదల వలలో చిక్కి
అంతరాత్మ సరళి మరచి ముందడుగేస్తూ
ముఖ్యమంత్రి పదవి కదన రంగంలో
నలువైపుల చరిస్తూ తన
క్షేమానికి కూడా నోచుకోకుండా
క్షితి దాహానికి బలైపోయిన అమరుడు,ఆంధ్రరథసారథి...........వై.ఎస్.అర్

కఠోరనిర్వాహాణపు సంకెళ్ళ నుంచి
విముక్తులను చేస్తూ అపార భగిరతునివలే
బాలల భవిష్యత్తుకై విశ్వవిద్యలయ ములను
వేదిక చేసిన అపారవివేకవంతుడు...................వై.ఎస్.అర్


ఒకదేహముతో పరిపాలించి
మన ప్రాణములు నిలుపుటకై
పక్కాఇల్లనే రక్షణపు కవచాలుగ
నిర్మించిన ప్రాణదాత ............వై.ఎస్.అర్


విలయతాండవం చేస్తున్న
ఆంధ్రుల కన్నీటి ధారకు
నేడు ఏ ఆనకట్టలు ఆపలేవు
ఈ పౌరుష ప్రతిబింబాలు .
ప్రతి క్షణం సంతోశాలందించిన డాక్టర్.
అందుకు,
తన ప్రాణలను అందించి ,
మనోవేదనకు గురిచేసిన రాజశేఖరసార్వభౌమ.......వై.ఎస్.అర్

నే శోకించాను అటువంటి నేత రాలినందుకు ,
రాతలు అటువంటి నేతలకు అలా రాసినందుకు ,

జ్వలియించే ఉద్బోదనపు ఆవేశాలకు లోనవుతు మూగబోయిన నాఅంతరాత్మ సాక్షిగా
రగిలేకణకణాంతపు ఉజ్వల భవిష్యత్తుకు
నిరంతరాభిముఖంగా తెలియజేస్తున్న విశాదవార్త.
భాదతో సుశ్కించే నాహృదయం ,భయంతో వణికే నా కలంతో
తరుముతున్న నాగుండే, మాటలు రాని నా కవిత్వంతో నిరంతర జ్ఞాపకార్థం
హోయల లోతుల్లొంచి జనియించిన యశస్సు ఇది.




2. ఈనాటి సమాజానికి .....!!!!
-కె.పి.రాఘవేంద్ర


కావాలోయ్, కావాలోయ్
కావాలి, కావాలి ,
ప్రపంచానికి కావాలో విజేత
ఎటువంటివాడైన
మురికివాడైన , కఠినుడైన
స్వార్థపరుడైన, భుక్తిజీవైన

కావాలోయ్ ఈ ప్రపంచానికో విజేత
అణగద్రొక్కె నరరూప రాక్షసులు
భక్షించే క్రూర మృగాలు
ద్వేషపూరిత రాజకీయ కుట్ర
దారుఢ్యులు
కావాలోయ్, కావాలోయ్



కావాలోయ్ ఈ ప్రపంచానికో సమర్థుడు
అరాచకుడై, అసమర్థుడై నవారిని
దండించే వాడు ,
నయవంచితుడైన కునీతుడు

కావాలోయ్ ఈ ప్రపంచానికో శాసనధిక్కారి
ప్రకృతిచే శపించబడ్డవాడు
జనులను కబలించే కాలంతకులు

కావాలోయ్ ఈ ప్రపంచానికో భక్తి
పరులను భక్షించాలన్న ఏక భక్షుడు
మాటలతో మాయపుచ్చె కామరూపి

కావాలోయ్ ఈ నాటి సమాజానికి జ్ఞాని
లోలోపల వుంటూ లోకపు
నడతలను సంహరించేవాడు

కావాలోయ్ ఈ ప్రపంచానికో ఆణిముత్యాలు
ఇతలరులను దోచువాడు
దానిని నలువైపుల రక్షించుకొనే బ్లాక్ వ్యాపారులు .


3.స్నేహం

1. గుండె చాప్పుడు మరొకరికి
గుర్తుగా ఉండేటట్లు చేసేది స్నేహం
మనస్సులను కలిపే తన్మయం స్నేహం
సూర్యకిరణాలను చీల్చే మంత్రం స్నేహం
నిస్వార్థపు జీవితాల కలయిక స్నేహం
ఆపదలో ప్రాణాన్ని కూడ లెక్కచేయనిది నాస్నేహం

2. తియ్యని స్వరంతో పిలుపు అందించేది స్నేహం
కలకాలం తోడంటూ ఉంటూ నడిచేది స్నేహం
స్వార్థపు హస్తాలకు అందనిది స్నేహం
నిజం అనే నమ్మకానికి పునాది నాస్నేహం
వీడరాని కరిగిపోయి కలిసిపోయింది నాస్నేహం

3.కలిమిలేని లోభాలకు లొంగనిది నాస్నేహం
మంచి చెడ్డల మనిషిలోని నడవడిని
నేర్పే అతితమైన గ్రంథం స్నేహం
మందార మకరందాల మాధుర్యమే స్నేహం
స్నేహితుల మద్య చూసే కళ్ళల్లో ఉండేది స్నేహం
ఆప్యాయతల, అనురాగ మాళిక నాస్నేహం

4. ఒంటరి కాని జీవిత పయనం స్నేహం
తెలిసి తెలియని తరుణంలోని మాట్లాటపోట్లాటల
సముదాయం స్నేహం
తోడు లేని జీవితానికి పలకరింపే స్నేహం
క్షణం మారి నా, ఊపిరి ఆగినా, రాలి పడలేని మనస్సులోని కన్నీటిధార నాస్నేహం
శ్వాసపోసే ఆయుధం స్నేహం
విజయం
అందిచేది నాస్నేహం

5. సృష్టిలోని మనషులకు
నిలిచిపోయిన, నవరసాల
పల్లకిల మాటలను అందించే బందం స్నేహం
ఈ అనంత విశ్వంలో
పక్షిలా ఎగిరితే ఆశ్రయాన్నిస్తుంది స్నేహం
ఓర్పుతో నీడవలె వెన్నంటి ఉండేది స్నేహం

6. నీకోసం నీరీక్షణతో వేచియున్న అనేది స్నేహం
నవ్వుల చిరుజల్లు స్నేహం
ఆనందాలకు నిలయమైన అమృతవర్షం స్నేహం
గొప్పదంటూ మిగిలి, త్యాగం చేయించేది నాస్నేహం.....
స్నేహం అనే అమృతాన్ని ప్రతి ఒక్కరు త్రాగాల్సిందే అది వారికొక జీవిత గుణపాఠం.

రాఘవహారి కీర్తనలు
రచన :-కె.పి.రాఘవేంద్ర
I.D.B081623



కీర్తన-1
పల్లవి:-పాదాంబుజుడనీ పవళీకృతుడ సింగోటనారసింహా
గద్దెగోత్రాతూర్పింటివాసా లక్ష్మీనారసింహా
సత్యశ్రీ తనయ నవరసశోభ నరేశా.................. "పాదాం !!
చరణం 1:-యశస్కరీ శ్రీ కవితాబ్రహ్మా
శ్రీ వత్స తేజోధ్బావో నా తెలుగువీణ
పరిశోధకుడవు భవదివ్యుడవు
సంస్కృతీరూపా సుగుణీయచంద్ర ........"పాదాం !!
చరణం 2:- బంధుప్రియవాణి రచనోత్పాదక
నవయుగబ్రహ్మా నాదత్తరా
ఓంకారరూపా సర్వాణి శంభూ
కొల్లపూర్ వాస కారుణ్యరూపా........... "పాదాం !!
చరణం 3:- సద్సంగతుడవు ఆచార్యుడవు
ఆధ్యపనమే నీ తపఃశుద్ది ..
శరణను వారికి సర్వశ్రీరక్ష
కాముక ప్రియ భక్తవరద ..............."పాదాం !!

Monday, February 8, 2010

ఈ కథకు మీరేం పేరు పెడుతారు ?

రవీంద్రభారతి.......
సన్మానసభ జరుగుతుంది.
ఆ సభలో సన్మాన గ్రహీతను ప్రతీఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

పూల దండలు,శాలువాలతో సత్కరిస్తున్నారు.
ఇంతకీ అ సన్మాన గ్రహీత పేరు జయశ్రీ.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ......
***
జయశ్రీ చిన్నప్పటినుంచి చాలా గారాబంగా పెరిగింది.ఒక్కగానొక్క కూతురు.ఎదుటివారిని అర్ధం చేసుకుంటూ,వారిని నొప్పించకుండా ప్రవర్తించే గొప్ప సంస్కారవంతురాలు.జంతుప్రేమ చాల ఎక్కువ.
ఒక చిన్న కుక్కపిల్లని పెంచుకోవాలని ,దానితో రోజూ ఆడుకోవాలని తన సరదా.
కానీ తన తండ్రికి అలాంటివి నచ్చవు.అలాంటి జయశ్రీ ఒకరోజు............................................

తన స్కూటీ మీద కాలేజికి వెళ్లి వస్తుంటే దారిలో ఒక తెల్లని పావురం కరెంటు తీగల మధ్యన చిక్కుకొని అల్లడిపోతుంది.
దానిని చూసిన జయ మనస్సు బాధతో విలపించింది.
ఇంటికి వెళ్లి "అమ్మా! బూజు కర్ర ఎక్కడ ఉంది?
అని అడిగి దానిని తీసుకెళ్తుంటే,వాల్ల అమ్మ" ఇప్పుడు దానితో నీకేమవసరం వచ్చింది?"
అని ప్రశ్నిస్తుంది.జరిగిందంతా చెప్పి బయటకి తన స్నేహితురాలు గౌతమిని తీసుకొని వెళ్తుంది.
అక్కడికి చేరుకున్నాక స్కూటీ మీద నిల్చుని తన శాయశక్తులా ప్రయత్నించి దానిని కాపాడుతుంది.
క్రింద పడిన పావురం ఒక్కసారిగా విదిలించుకుని స్వేచ్చగా ఎగిరివెళ్లి ఒక చెట్టుకొమ్మ మీద వాలుతుంది.దానిని సంతృప్తిగా చూస్తూ చున్నీతో చెమటను తుడుచుకుంటూ గౌతమితో
మాట్లాడుదామని ఇటు తిరిగేలోపు తన చెంపమీద దెబ్బ పడుతుంది కొట్టింది తన తండ్రి....!? కోపంగా.....
రోడ్డుమీద ఏంటా సర్కస్ ఫీట్సు?
దారిలో అంతమంది వెళ్తున్నా ఎవరికి లేని బాధ నీకెందుకు?
అంటూ తనని ఇంటికి లాక్కుని తీసుకొని వెళ్తాడు.
ఇలా జరిగిన కొద్దిరోజులకే మరొక సంఘటన జరిగింది.

***

ఆ రోజు ఆదివారం.జయశ్రీ ఫ్రెండ్స్ తో కలసి తన వీడియోకెమెరా తీసుకొని షికారుకు బయలుదేరుతుంది.పక్షుల యొక్క కిలకిలారాగాలు,అందమైన పూలమొక్కలు,ఇలాంటి ప్రకృతి సౌందర్యాలు ఆస్వాదిస్తూ,ఒక్కొక్క దాన్ని తన కెమెరాలో బంధిస్తుంది.
అలాంటి సమయంలో అక్కడ చెత్త కుండీలో పడి ఉన్నటువంటి ప్లాస్టిక్ బ్యాగుల్లోని ఆహారాన్ని అక్కడ పశువులు తింటున్నాయి.అందులో ఒక ఆవు యొక్క పొట్ట చాల లావుగా కనిపిస్తుంది.
ఆహారాన్ని తీసుకోలేక పోతుంది.దాని కళ్లు మూతపడిపోతున్నాయి.
సరిగ్గా రెండు నిముషాల తర్వాత ఆ ఆవు వున్నచోటునే కుప్పకూలిపోతుంది.
ఇదంతా గమనిస్తున్న జయశ్రీ ,గౌతమి మిగతా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి చేరుకుంటారు.
తనకు తెలియకుండానే అదంతా రికొర్ద్ చేసింది.
వెంటనే దగ్గరలో వున్న పశు వుల డాక్టరుకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పి
అక్కడికి రమ్మంటుంది.
కాసేపటి తర్వాత ఆ డాక్టర్ వ్యానుతో సహా వచ్చి దానిని తీసుకొని హాస్పిటలుకు వెళ్తారు.
వారితో పాటు గౌతమి,జయశ్రీ కూడా వెళ్తారు.


అక్కడ హాస్పిటల్ లో ఆవును పరీక్షించిన తర్వాత డాక్టర్ ఆ ఆవు మరణించినట్లుగా నిర్దారించి వీళ్లిదారికీ చెప్పారు.
ఆ వార్త విన్న జయశ్రీ అసలు ఎందుకిలా జరిగిందని అతన్ని అడుగుతుంది.అప్పుడు ఆ డాక్టర్ "ప్లాస్టిక్ అనేది చాల చౌకగా దొరుకుతుందని మనం విరివిగా ఉపయోగిస్తుంటాము.కాని దానివల్ల మనకు తెలియకుండానే మనం హానికి గురి అవుతున్నాము. ఆ ఆవు విషయంలో కూడా అదే జరిగింది.రోజూ అలా ప్లాస్టిక్ బ్యాగుల్లోని ఆహారాన్ని తింటూ ఒక్కోసారి ప్లాస్టిక్ కవర్లను కూడా ఇవి తింటాయి.అవి జీర్ణం కాక కడుపులోని ప్రేగుల్లో నిలువగా ఉండిపోతాయి.కాబట్టి జీర్ణ శక్తి తగ్గిపోతుంది.
ఆ ఆవు విషయంలో మరొక దురదృష్ఠం ఏమిటంటే ఇది ప్లాస్టిక్ కవర్లతో పాటు అందులో మనం పడవేసే గాజుముక్కల్ని కూడా తిన్నది.
ఆ గాజుముక్కలు ఇప్పుడు గుండెకు గుచ్చుకొని చివరకు అది చనిపోయేలా చేసాయి. "అంటూ వివరించాడు. ఇదంతా రికార్ద్ చేసింది.చాలా బాధ పడింది."
మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తన వంతు సహాయం చేయాలి
ఆ మూగ జీవాలకు ,అని ధృడంగా నిశ్చయించుకుంది.
తన నిర్ణయం గౌతమికి చెప్పింది.
తను కూడా సంతోషంగా ఒప్పుకొని ఆలోచన చేయసాగారు...............

***

ముందుగా జయశ్రీ గౌతమి వాళ్ల అమ్మను కలిసి తన పధకం చెప్పింది.
ఆమె సూపర్ మార్కెట్ నడుపుతుంది.ఆమె తన బిజినెస్ పాట్ నర్ని కలిసి ఆ విషయం చెప్పింది.వాళ్లందరికీ ఒక ఫంక్షన్ హాలు పేఇరు చెప్పి,అక్కడికి రమ్మని చెప్పింది.తను, గౌతమి ఇద్దరు కలిసి ఆ చుట్టుప్రక్కల వున్నా వర్తకులకు,వ్యాపారులకు విషయం చెప్పి అక్కడికి రమ్మని చెప్పరు.
ఒక చిన్న ప్రాజెక్ట్ అద్దెకు తీసుకొని కాలేజికి ఒక రోజు సెలను పెట్టి అనుకున్న రోజుకు ఫంక్షన్ హాలుకు వెళ్లారు.ఒక్కొక్కరూ వస్తున్నారు.దాదాపుగా 50 మంది వచ్చారు.ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి తను రికార్డ్ చేసినదంతా చూపించింది దృష్యాలు చూసినంతసేపు హాలంతా నిశ్శబ్దం అమలుకుంది.
తర్వాత "మనం ఈ మూగజీవాలపైనే ఆధారపడి బ్రతుకుతాం. అలాంటి అవి మన చర్యల వల్ల నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోతున్నాయి.దయచేసి అందరూ ఆలోచించండి."
అని వారికి చెప్పింది.ఎవ్వరూ కూడా మారుమాట్లాడకుండా వెళ్లిపోయారు.
ఏమైందో అర్ధంకాక తను నిస్సహాయస్థితిలో కూలబడిపోయింది.

వారం రోజుల తర్వాత...." ప్లాస్టిక్ వాడకం నిర్మూలనపై విద్యార్ధిని కృషి" అంటూ పేపర్ లో ప్రకటన చూసిన వారందరూ కలిసి ఒక సమూహంలాగ ఏర్పడి గోనెసంచులు తయారుచేసే ముడిపదార్ధాలతో బ్యాగులు తయారు చేసే ఒక చిన్న సంస్థను స్థాపించారు.కాలక్రమేణా అది మరింత అభివృద్ధి చెందింది.
***
కాలేజి నుంచి ఇంటికి వచ్చిన జయశ్రీకి ఇళ్లు తాళం వేసి కనిపించింది.
అప్పుడు పక్కింట్లో వుండే వనజ ఆంటీ వచ్చి "మీ నాన్నగారికి ఆఫీసు నుండి వస్తుంటే
యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే కబురొస్తే మీ అమ్మ ఏడుస్తూ వెళ్లింది.
అనగానే స్కూటీ తీసికొని బయల్దేరింది.బెడ్ మీద నిస్సహాయస్థితిలో పడివున్న
తన తండ్రి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రి మీద పడి ఏడుస్తూ వుండిపోయింది.
ఇంతలో లేచిన తన తండ్రి రాఘవ " నాకు ఇలా జరగాల్సిందేనమ్మమ్!
ఆ రోజు పావురాన్ని కాపాడిన నిన్ను అంతమందిలో కొట్టి ,అంతమంది వుండగా నీకెందుకు?
అని తిట్టాను.ఈ రోజు పావురం స్థానంలో నేను రోడ్డు మీద రక్తం మడుగులో పడివున్న నన్ను చూసి, నాకెందుకులే అనుకొని ప్రతీఒక్కరూ అలాగే చూస్తూ వెళ్లిపోయారు.కానీ ఎవరో నీలాంటి మహానుభావుడు ఇక్కడ చేర్పించారు.లేకపోతె ఈ పాటికి...... అంటూ కూతురు చేయి పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు.ఇంతలో మళ్లీ తేరుకొని " నీకొక గుడ్ న్యూస్ అంటూ ఆ సంస్థ గురించి చెప్పాడు."


దాంతో సంతోషంగా" నిజమా డాడి! వాళ్లందరూ ఆ రోజు మౌనంగా వెళ్లిపోయేసరికి కోపంలో వెళ్లారేమో అనుకున్నాను. నేఇని నమ్మలేకపోతున్నాను." అంది. అంతేకాదమ్మా!
ఆ సంస్థ ఏర్పడటానికి మూలకారణం నువ్వని తెలిసుకుని నీకు సన్మానం చేదామనుకుంటున్నారంట
అది చెబుదామనే నీ కోసం వస్తుంటే ఇలా జరిగింది అన్నడు కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ......

***

సన్మానగ్రహీత అయినటువంటి జయశ్రీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అయింది.
ఆ రోజు జయశ్రీ కి ఒక పార్సల్ వచ్చింది." నాకెవరు పంపిచ్చారబ్బా ?
అనుకుంటూ తెరిచేసరికి తన కళ్లని తానే నమ్మలేకపోయింది.
అట్టపెటెలో తెల్ల్లగా వున్నటువంటి బుజ్జి కుక్కపిల్ల బయటకు వచ్చింది మూలుగుతూ..."
అక్కడ పంపినవారి అడ్రస్ చూస్తే తన తంద్రి పేరు కనిపించింది.
జన్మదిన శుభాకాక్షలతో నీ తండ్రి అని...............

పి.రాధిక [ B081209]
Class room-32.


Sunday, February 7, 2010

" దరికి రాని దరి దరిచేరినది"

" దరికి రాని దరి దరిచేరినది"
------ సిరికొండ మాధవి

నా ప్రపంచం కాని ప్రపంచంలో అడుగుపెట్టాను.
అదే మా స్కూలులో. అక్కడ నాకు ఎదురుపడేవి అన్నీ తెలిసిన మొహాలే.
కాని ఒక్కరూ పలకరించరు. .....అందరూ సుపరిచితులైనను అపరిచితులు.....!!!!
అందరిలో నన్ను పలకరించేవి........ పచ్చని చెట్లూ....సీతకోకచిలుకలూ
... నా భుజం మీద ఎప్పుడూ వాలే వేపాకులూ....... నాకెంతో ఇష్టమైన నా స్కూలులోని
డిసెంబర్ పూలూ>>>>> వాటి స్నేహితులైన తేనెటీగలు.,,,,, ఇదే నా లోకం.
బహుషా! నా ప్రపంచంలోని మాట్లాడగల్గే వాళ్ళు ఎవ్వరూ నాతో మాట్లాడరు.
రేపు ఆగష్టు ౧౫ రోజు.
నాకిష్టమైన నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల జెండాలతో నిండింది .
నాకిష్టంలేని నా స్కూలు. కొందరు జెండాలు అందించడం, కొందరు అతికించడం చేస్తున్నారు.
నా రాకతో కొంతనైనా విరామం జరగలేదు వాళ్ళ పనిలో...మా తరగతిలోకి అడుగిడాను.
ఎవ్వరూ నా వైపు కన్నెత్తి చూడలేదు.
మా తరగతిని తీర్చిదిద్దడంలో , అలంకరించడంలో నాకు భాగం ఇవ్వాలని వాళ్ళకి తెలియదో, తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో నాకు తెలియడంలేదు.
నా స్థానాన్ని (తరగతిలో, ప్రపంచంలో) నేను గుర్తుకు తెచ్చుకుని నేరుగా ఒక మూలన ఉన్న బల్లపై కూర్చున్నాను. ఆ బల్లపై ఒక మెరుపుతీగ నాకు మాట్లాడుతున్నట్టుగానూ, నన్ను పలకరిస్తున్నట్టుగానూ వుంది. దాన్ని నా చేతిలోకి తీసుకొని నేత్రానందం పొందుతున్నాను.
ఆ మెరుపుతీగ రంగురంగులతో నిముషానికి ఓ విధంగా మారుతూ ఆకర్షిస్తుంది.
ఇంతలో నాతో స్నేహం చేయని స్నేహితురాలు వేగంగా వచ్చి వడిగా లాక్కొని వెళ్ళింది.
ఈ క్షణికానందానికి కూడా నేను అర్హురాలిని కానేమో!!!!!!!!
నాలో లోపం గురించి ఆలోచించుకుంటే నాకే తోచదు.
అందరూ నాతో మాట్లాడతారు. కానీ మనస్ఫూర్తిగా కాదు.
అందరూ నాతో ఆడతారూ, పాడతారు. కానీ మనస్సాక్షిగా కాదు.
నాతో బావుండి చాటుగా అనుకున్నా పర్లేదు.
కానీ నా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతారు. నాకెంత బాధేస్తుందంటే నన్ను నేను చంపుకోవాలన్నంత. కానీ వాళ్ళందరికీ ఆదర్శంగా వుండి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.
అదే నన్ను ఎపుడూ ఆపుతూ వుంటుంది.
ఏదో ఒక రోజు వారికి నన్ను నేనుగా నా ప్రతిభను చూపిస్తాను.
వారిని అబ్బురపరుస్తాను. అప్పుడైనా వారి స్నేహాన్ని, అభిమానాన్ని పొందుతానేమో. కానీ ఒక్కోసారి అనుమానం వస్తుంది.
నిజంగా, ఈ లోకం ఎంత విచిత్రమైంది.
ఉదయించే సూర్యుడికి నమస్కారం చేస్తూ, అస్తమించే సూర్యుడు వైపు కూడా చూడరు.
అందమనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఉదయం ఇష్టమైతే, ఒక్కొక్కరికి రాత్రీ, కటిక చీకటి ఇష్టమవుతుంది.
నల్లగా ఉన్నంత మాత్రాన చీకటిని అసహ్యించుకోలేము కదా!
చీకటి ఎన్నో విజయాలను తెచ్చిపెట్టింది. ఉదాహరణకు మన స్వాతంత్ర్యం.

ఇవన్నీ ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాను.
ఇంత గాఢంగా ఆలోచిస్తున్న నా మనసును హఠాత్తుగా మలిచింది ఓ సన్నివేశం.
ఒక మూర్ఖుడు, నీచుడు, పురుషాహంకారుడు అయిన ఓ వ్యక్తి, మనిషి అనడానికి అర్హుడు కాడు. వాడు ఒకావిడను రెండు దుడ్డుకర్రలతో బాదాడు. ..
ఇంకనూ ఆగక కాలితో తన్నాడు. .....ఆమెలో నేను విప్లవాన్ని ఆశించాను.
ఆదిశక్తిగా మారుతుందనుకున్నాను. కానీ ఆమె కళ్ళు అసహనాన్ని ప్రదర్శించాయి. ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా కనిపించింది. 'నా కళ్ళలోంచి నీళ్ళు అసంకల్పితంగా రాలాయి'. నా మనసు నా చెంపపై చెల్లుమని చెంపదెబ్బ కొట్టింది. ఒక్క ఉదుటున కోలుకున్నాను. చుట్టూ వినోదం చూస్తున్న జనాన్ని చూసి నా కళ్ళు నిప్పులు కక్కాయి. నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది.
దాన్ని ఆపాలని నా మనసు ఉద్వేగంతో మండుతుంది.
నన్ను నేను ఆపుకోలేకపోయాను.
కానీ నా ఆటో శరవేగంతో వెళ్ళడంతో ....నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోయాను.
ఈ సంఘంలో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆడదానికి ఇంకా గౌరవం లేకుండ పోయింది.
ఆడది ఎన్నో ఘోరాలను సహిస్తుంది.
అందరినీ, తను నమ్మిన వాళ్ళనీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది.
తన జీవితాన్ని సైతం వాళ్ళ కోసం త్యాగం చేయగలదు.
అలాంటి మహిళను పురుషుడునే ఒకే ఒక్క కారణంగా గర్వాంధంతో మధమెక్కి హింసకు గురిచేస్తాడు. క్రూరంగా, జంతువులా ప్రవర్తిస్తాడు. ఆడది కలువ లాంటిది. చల్లని చంద్రుడు దొరికితే ఆరాధిస్తూ, చల్లని వెన్నెలలో హాయిగా జీవితం గడుపుతుంది. అదే మండే సుర్యుడు భర్తగా వస్తే నిస్సహాయంతో కుంగిపోతుంది. అటువంటి సున్నితమైన మనస్కులను అనంత ఘోరాలకు గురిచేస్తున్నారు.
ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా ఆటో ఆగింది .
మా ఇళ్ళు లాంటి అనాథాశ్రమం వచ్చింది. అదే ఆలోచిస్తూ ఉన్నాను. నిద్ర కూడా సరిగా పట్టలేదు.
మళ్ళీ లేచి స్కూలుకు బయలుదేరాను.
ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉంది.
విచిత్రంగా ఉంది.
నాలో ఏదో కొత్తగా ఉంది.
గొంతు ఏదో కొత్త రాగాన్ని ఆలాపిస్తుంది.
మనసు ఏదో మౌనాన్ని అనుభవిస్తుంది.
నాకు ఎందుకో కొత్తగా ఉంది.
ఏమో అర్థంకావట్లేదు. నా మనసు చంచలంగా ఉంది.
నేను నా పాఠశాల కు వెళ్ళాను.
నా సీతాకోకచిలుకలూ, డిసెంబర్ పూలూ, వేపాకులూ ఆహ్లాదంగా పలకరించాయి.
నాకళ్ళలోఎందుకో విజయ దరహాసం తొణికిసలాడుతోంది. . వేదిక చాలా బావుంది.
ఈ రోజు ఆగష్టు 15, చూస్తూండగానే సభ మొత్తం నిండుకుంది.
అందరూ ఒకే జాతి వారులా ఒకే యూనిఫారములో ఉండడంతో కనువిందు చేస్తుంది సభ. వేదికనలంకరించారు పెద్దలు. ప్రసంగాలు..... ఆర్భాటాలూ, ,,,,,
సంగీత కచేరీలూ.... జరుగుతున్నాయి.
ఏవి నామనసును ఆనందింపజేయట్లేదు.
నా మనసు ఇంకా ఏదో ఆనందం కోసం ఎదురుచూస్తుంది. ఆకస్మాత్తుగా, ఆశ్చర్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఆలోచితంగానో, అనాలోచితంగానో నా పేరును వేదికపై ఆహ్వానించారు.
నేనో కాదో అని అనుమానపడ్డాను. కాని నన్నే పిలిచారు. పాట పాడడానికి. ...
నా మనసు కోలుకోవట్లేదు. వేదికనెక్కాను. ఎన్నో కళ్ళు నా పాట కోసం వేచిచూస్తున్నాయి. ఎన్నో శ్రవణేంద్రియాలు నా పాటకై ఉవ్విళ్ళూరుతున్నాయి. కోలుకున్నాను. పాట మొదలు పెట్టాను.

ఆ........... ఆ..............
"క్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా....... ఆ.....
.................................................
................................................

రెండు నిముషాలు అందరి మనసులు ఆకట్టుకోవాలని నా శాయశక్తులా పాడాను.
నాకు నచ్చింది.....
కరతాళ ధ్యనులు ...నా మనసులో మోగాయి.
ఇంతలో అటుగా వెళ్తున్న ఒక కారు ఆగింది.
చాలా పెద్ద సంగీత దర్శకులు నా దగ్గరకు వచ్చి "నా సినిమాలో పాడతావా, అమ్మా!" అన్నారు.
నా మనసు కోరుకున్న ఆనందం దొరికింది.
చాలా రోజులుగా నేను అనుభవించిన క్షోభ ....ఒక్కసారిగా కట్టలు దాటుకొని కన్నీరుగా బయటపడింది. నమ్మలేక పోయాను. "కానీ నిజానికి జీవితం చాల గొప్పది".

***
10 సంవత్సరాల తరువాత.
***
నేనిప్పుడొక పెద్ద గాయకురాలిని.
ఎంతో మంది మహిళలను గాయనిలుగా మార్చాను.
జీవితం సార్థకమైంది. ఇంకా నా ప్రాణం ఉన్నంతవరకు స్త్రీలను కాపాడతాను.
నేను జీవితంలో ఎదుర్కున్న ప్రతీ కష్టసమయంలో చావాలానుకొని చచ్చి ఉంటే
ఈ విజయం దక్కి వుండేది కాదేమో. ......
జీవితం విలువైనది. చాలా చాలా విలువైనది.
ఇప్పడికైనా కళ్ళుతెరిచి నిజాన్ని చూడండి. స్త్రీలను రక్షించండి.
రక్షించకపోయినా కనీసం కళ్ళముందు
అన్యాయం జరిగినపుడు కళ్ళప్పగించి చూడొద్దు.
వారి గొప్ప జీవితాన్ని మీ చేతులార అంతం కానివ్వకండి.
వారి ప్రతిభను గమనించడంలో ఆలస్యం చేయద్దు.
అనాథలనూ, స్త్రీలనూ అపహాస్యం చేయద్దు.
{దయచేసి పాటించండి.
}
_____సిరికొండ మాధవి
రాజీవ్ గాంధి సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం .....బాసర .
మా విద్యాణిముత్యం రాసిన ఈ కథను యథాతధంగా ఇక్కడ ప్రచురిస్తున్నాను.
దయచేసి తప్పులు ఎంచకుండా మీ అభిప్రాయాలు తెల్పండి .